Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ 12 ఆటగాళ్ల వేలం జాబితా
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ ఆటగాళ్ల వేలానికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. 8 ప్రాంఛైజీల్లో 70 మంది క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉండగా, వేలంలో 1003 మంది క్రికెటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఆ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ రాజీవ్ శుక్లా బుధవారం వెల్లడించారు. డిసెంబర్ 18న జైపూర్లో ఐపీఎల్ వేలం జరుగున్నది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, బిహార్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, ఉత్తరాఖాండ్, పుదుచ్చేరి నుంచి తొలిసారి ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. ఇతర దేశాల నుంచి 232 ఆటగాళ్లు వేలంలో చోటుచేసుకున్నారు.