Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : 2019 బిజీ షెడ్యూల్ దృష్ట్యా ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్ మాక్స్వెల్, అరోన్ ఫించ్లు ఐపీఎల్ 2019కు దూరమయ్యారు. డిసెంబర్ 18న జైపూర్లో జరగాల్సిన వేలంలో మాక్స్వెల్, ఫించ్లు జాబితాలో ఉన్నారు. కానీ వన్డే వరల్డ్కప్, స్వదేశీ వేసవి సీజన్, ఇంగ్లాండ్ యాషెస్ వంటి ప్రథమార్థ బిజీ షెడ్యూల్ కారణంగా ఐపీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్ యువ ఆల్రౌండర్ శామ్ కర్రన్ కనీస ధర. 2 కోట్లు దక్కించుకోగా, దిగ్గజ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కనీస ధర రూ. 1 కోటికి పడిపోయింది. లసిత్ మలింగ, మాథ్యూస్, మెక్కలమ్, షాన్ మార్ష్, క్రిస్ వోక్స్ సహా మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, వృద్దిమాన్ సాహాలు వేలంలో ఉన్నారు.