Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిప్పులు చెరిగిన అవేశ్ ఖాన్
ఇండోర్ : హిమాచల్ ప్రదేశ్పై మెరుపు విజయంతో ఉత్సాహంతో ఉన్న హైదరాబాద్కు మధ్యప్రదేశ్ గట్టి ఝలక్ ఇచ్చింది. యువ సీమర్ అవేశ్ ఖాన్ (7/24) నిప్పులు చెరగటంతో తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ 124 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ను అవేశ్ ఖాన్ హడలెత్తించాడు. ఓపెనర్లు తన్మరు అగర్వాల్ (0), త్యాగరాజన్ (4), రోహిత్ రాయుడు (4), సందీప్ (0), సుమంత్ (0), రవితేజ (0)లు దారుణ వైఫల్యం చెందారు. హిమాలరు అగర్వాల్ (69) అర్ధ సెంచరీతో హైదరాబాద్కు మూడెంకల స్కోరు అందించాడు. కెప్టెన్ అక్షిత్ రెడ్డి (21), మెహది హసన్ (15)లు రెండెంకల పరుగులు చేయగలిగారు. మధ్యప్రదేశ్ బ్యాట్స్మెన్ అజరు (81), పాటిదార్ (51) అజేయ అర్ధ సెంచరీలతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 168/1తో ఆడుతోంది. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సొంతం చేసుకున్న మధ్యప్రదేశ్.. విజయంపై కన్నేసింది.