Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్పై కివీస్ టెస్ట్ సిరీస్ కైవసం
అబుదాబి : ఆతిథ్య పాకిస్తాన్పై 49 ఏండ్ల అనంతరం టెస్ట్ సిరీస్ను న్యూజిలాండ్ చేజిక్కించుకుంది. నిర్ణయాత్మక మూడోటెస్ట్లో పాక్ జట్టుపై 123 పరుగుల తేడాతో కివీస్ గెలిచి ఈ ఫీట్ నెలకొల్పింది. 280 పరుగుల విజయలక్ష్యంతో ఐదోరోజు బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 156 పరుగులకే పరిమితమైంది. దీంతో మూడు టెస్ట్ల సిరీస్ను పర్యాటక న్యూజిలాండ్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. సౌథీ, అజాజ్ పటేల్, సోమర్విల్లెలు మూడేసి వికెట్లు కూల్చారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విలియమ్సన్, సిరీస్ యాసిర్ షాకు దక్కాయి.