Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కపిల్, జహీర్ తర్వాత ఇషాంత్
- 23 మ్యాచుల్లో 50 వికెట్లు
అడిలైడ్: బ్యాట్స్మెన్స్కు చుక్కలు చూపించే బౌలర్లలో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఒకడిగా ఎదిగాడు.తాజాగా అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో అతడు అలాగే రెచ్చిపోయాడు. ఓపెనర్ ఆరోన్ ఫించ్ను పెవిలియన్ పంపించి తొలి వికెట్ సాధించాడు. మిడిలార్డర్లో కీలకమైన ప్రత్యర్థి నాయకుడు టిమ్ పైన్ను ఔట్ చేశాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలోనూ ఇషాంత్ సత్తా చాటాడు. అడిలైడ్ టెస్టులో రెండు వికెట్లు తీసిన ఇషాంత్ అరుదైన రికార్డునూ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై 50 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. దిగ్గజాలైన కపిల్ దేవ్, జహీర్ ఖాన్ సరసన నిలిచాడు. 23 మ్యాచుల్లో ఈ సొగసరి(లంబూ) ఈ ఘనత సాధించడం గమనార్హం. కపిల్ దేవ్ 20 మ్యాచుల్లో 79, జహీర్ ఖాన్ 19 మ్యాచుల్లో 61 వికెట్లు తీశారు. జహీర్ 2008-09 పర్యటనలో రికీపాంటింగ్కు వేసిన బౌలింగ్ అందరికీ గుర్తుండిపోయిన విషయం విదితమే. ప్రస్తుత పర్యటనలోనే ఉమేశ్ యాదవ్ కూడా ఈ ఫీట్ను సాధించే అవకాశాలున్నాయని క్రీడాపండితులు అంటున్నారు. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి..42 వికెట్లు నేలకూల్చాడు. అదే ఊపుతో మిగతా ఎనిమిది వికెట్లు సాధించి..హాఫ్ సెంచరీ కొట్టేఛాన్స్ ఉన్నదని వారు గట్టిగా చెబుతున్నారు.