Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరంగ్రేటంలోనే అజేయంగా 267
- హైదరాబాద్ దారుణ ఓటమి
- మధ్యప్రదేశ్కు ఇన్నింగ్స్ విజయం
ఇండోర్ : సొంతగడ్డపై విజయంతో ఇండోర్కు వెళ్లిన హైదరాబాద్కు అక్కడ భారీ భంగపాటు ఎదురైంది. హైదరాబాద్ను వరుసగా 124, 185 పరుగులకే కుప్పకూల్చిన మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 253 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో రోజే నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకున్నది. ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్కు ఇదే తొలి ఓటమి. అరంగ్రేట ఆటగాడు అజరు రొహెరా (267 నాటౌట్, 345 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్స్లు) అరంగేట్రంలోనే అజేయ ద్వి శతకంతో ఫస్ట్క్లాస్ క్రికెట్లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అజరుతో పాటు దూబె (139 నాటౌట్, 233 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్లు) శతకబాదటంలో తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ 562/4 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. 1994లో హర్యానాపై ఫరి దాబాద్లో ముంబయి స్టార్ ఆమోల్ మజుందర్ నెలకొల్పిన 260 పరుగుల అరంగేట్ర ఇన్నింగ్స్ను ఇండోర్లో అజరు బద్దలుకొట్టాడు. అజేయంగా 267 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండో ఇన్నింగ్స్లో రోహిత్ రాయుడు (72) రాణించినా.. 65.5 ఓవర్లలోనే కుప్పకూలింది. తన్మరు అగర్వాల్ (24), అక్షిత్ రెడ్డి (4), సందీప్ (4), హిమాలరు అగర్వాల్ (0), రవితేజ (4), త్యాగరాజన్ (12), సుమంత్ (23) విఫలమయ్యారు. మధ్యప్రదేశ్ సీమర్ అవేశ్ ఖాన్ (5/30) మరోసారి హైదరాబాద్ నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్లో సైతం అవేశ్ ఖాన్ 7 వికెట్లు కూల్చిన సంగతి తెలిసిందే. అరంగేట్ర మ్యాచ్లో అజేయ డబుల్ సెంచరీ సాధించిన అజరు 'మ్యాన్ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.