Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాకీ ప్రపంచకప్ 2018
- 5-1తో కెనడాపై ఘన విజయం
- లలిత్ ఉపాధ్యారు డబుల్ గోల్
- రాణించిన చింగల్సన, హర్మన్ప్రీత్
భువనేశ్వర్ (ఒడిశా) : ఆతిథ్య జట్టు అదరగొట్టింది. సమీకరణాలతో సంబంధం లేకుండా హాకీ ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్-సి చివరి మ్యాచ్లో కెనడాను చిత్తు చేసిన హాకీ ఇండియా 5-1తో ఘన విజయం సాధించింది. గ్రూప్-సిలో బెల్జియం సైతం ఓ డ్రా, రెండు విజయాలతో భారత్తో పాటు 7 పాయింట్లు సాధించింది. కానీ గోల్స్ అంతరంలో బెల్జియం (5) కంటే హాకీ ఇండియా (9) మెరుగ్గా ఉంది. క్వార్టర్స్ బెర్త్ కోసం బెల్జియం, కెనడాలో క్రాస్ ఓవర్ మ్యాచుల్లో అదృష్టం పరీక్షించుకోనున్నాయి. కెనడాతో మ్యాచ్లో ఆరంభం నుంచీ దూకుడు ప్రదర్శించిన మన్ప్రీత్ సేన గోల్స్ వర్షం కురిపించింది. మ్యాచ్ అర్థభాగంలో ఒక్క గోలే నమోదైంది. 1-0తో ప్రథమార్థంలో ముందంజ వేసిన భారత్, చివర్లో చెలరేగింది. వరుస గోల్స్తో 5-1తో క్వార్టర్ఫైనల్లో కాలుమోపింది. గ్రూప్-సిలో మూడో స్థానంలో ఉన్న కెనడా, గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచే జట్లు తలపడే క్రాస్ ఓవర్ మ్యాచ్ విజేతతో డిసెంబర్ 13న హాకీ ఇండియా క్వార్టర్స్లో పోటీపడనున్నది.
లలిత్ డబుల్ సంబురం : కెనడాపై భారత్ దూకుడుగా ఆడింది. తొలి నిమిషం నుంచే కెనడా గోల్పోస్ట్పై దాడులు మొదలెట్టింది. 10వ నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ లభించినా, గోల్ నమోదు కాలేదు. రెండు నిమిషాల తర్వాత భారత్కు మరో పెనాల్టీ లభించింది. ఈసారి హర్మన్ప్రీత్ సింగ్ పీసీని సద్వినియోగం చేశాడు. 12వ నిమిషంలో ఒడుపుగా బంతిని గోల్పోస్ట్లోకి నెట్టాడు. దీంతో తొలి క్వార్టర్లోనే 1-0 ఆధిక్యం భారత్ సొంతమైంది. తర్వాతి క్వార్టర్లో గోల్సేమీ నమోదు కాలేదు. కానీ మూడో క్వార్టర్లో కెనడా స్కోరు సమం చేసింది. ఫ్లోరిస్ వాన్ సన్ 39వ నిమిషంలో ఫీల్డ్ గోల్తో కెనడాను సమవుజ్జీగా నిలిపాడు. ఆఖరి 15 నిమిషాల ఆటలో సమవుజ్జీగా బరిలోకి దిగిన మన్ప్రీత్ సేన గోల్స్ వర్షం కురిపించింది. తొలుత చింగల్సన సింగ్ 46వ నిమిషంలో ఫీల్డ్ గోల్తో భారత్కు గెలుపు ఖాయం చేశాడు. తర్వాతి నిమిషంలో లలిత్ ఉపాధ్యారు సత్తా చాటాడు. సర్కిల్ లోపల కెనడా డిఫెన్స్ను ఛేదించి మెరుపు గోల్ కొట్టాడు. 51వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ను లోకల్ హీరో రోహిత్దాస్ అమిత్ గోల్గా మలిచి ఆధిక్యం 4-1కు పెంచాడు. ఆఖరి నిమిషాల్లో లలిత్ ఉపాధ్యారు మరోసారి సత్తా చాటాడు. కుడి కార్నర్ నుంచి సుమీత్ చాకచక్యంగా తీసుకొచ్చిన బంతిని గోల్పోస్ట్ ముందు కాచుకుని, భారత్ ఆధిక్యాన్ని 5-1కు పెంచాడు.