Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడిలైడ్లో టీమ్ ఇండియాను చారిత్రక విజయం ఊరిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోరుకే కుప్పకూలినా.. బంతితో మళ్లీ రేసులోకి వచ్చింది. కంగారూలను కంగారు పెట్టించి, ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. ఆడిలైడ్లో ఇప్పుడు డ్రైవింగ్ సీటు కోహ్లిసేనది. పరుగులు చేయటం కష్టమైన పిచ్పై ఇప్పటికే కోహ్లిసేన 166 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 2000 నుంచి ఆడిలైడ్లో ఛేదనలను గమనిస్తే.. 300 లక్ష్యాన్ని చేరుకున్న రికార్డు లేదు. 250లోపు టార్గెట్ను ఆడిలైడ్లో భారత్ సైతం ఛేదించింది. కానీ 300 పరుగులను అందుకోవటం ఇక్కడ అసాధ్యమనే చెప్పాలి. ఛేదనలో గెలుపొందిన జట్లు (2000 నుంచి వరుసగా నెగ్గిన మ్యాచుల్లో) 130/5, 182/3, 168/4, 187/7, 127/3, 233/6 (భారత్) పరుగులు చేశాయి. విఫల ఛేదనలో 201 (500), 233 (354), 315 (364), 128 (375), 250 (464), 312(531), 233 (354) పరుగులు నమోదయ్యాయి. సీమ్తో పాటు స్పిన్కూ అనుకూలిస్తున్న ఆడిలైడ్లో నాలుగు, ఐదో పరుగులు చేయగటం గగనమే. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. అతడిని ఎదురొడ్డి ఆసీస్ ఇక్కడ నిలవటం కత్తి మీద సామే. కోహ్లి అవుటైన తర్వాత భారత్ 28 బంతుల్లో ఒక్క పరుగే చేయగల్గింది. ఇది చాలు, పరుగులు చేయటం ఎంత కష్టతరమో. భారత్కు తర్వాత వరుస బ్యాట్స్మెన్లో భారీ హిట్టర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు ఉన్నారు. నేడు కోహ్లిసేన మరో 150 పరుగులు సాధిస్తే గెలుపుపై దీమాగా ఉండవచ్చు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్కు కుప్ప కూల్చేందుకు భారత బౌలర్లకు 98 ఓవర్లు అవసరమయ్యాయి. టెస్టు మ్యాచ్ చివరి రోజుల్లో పిచ్ అసాధారణంగా స్పందించే గుణం కల్గి ఉంటుంది. ఇంకా రెండు రోజుల ఆట ముగిలి ఉన్న నేపథ్యంలో నేడు చివరి సెషన్లో ఆసీస్ బ్యాట్ పట్టినా.. బౌలర్లకు అవసరమైనంత సమయం లభించనున్నది. పుజారా, రహానె క్రీజులో కొనసాగుతున్న నేపథ్యంలో కోహ్లిసేన నాల్గో రోజు టార్గెట్ 300 ప్లస్ పరుగులతో బరిలోకి దిగనున్నది. ఆస్ట్రేలియా డిఫెన్సివ్ ధోరణి, బలహీన బ్యాటింగ్ లైనప్పై 250 పరుగులైనా కాపాడుకొవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆడిలైడ్ గెలుపు బంతి ఇప్పుడు కోహ్లిసేన కోర్టులో ఉంది. మరి బ్యాట్స్మెన్ మరో 150 పరుగులు జోడించి.. ఆడిలైడ్ టీమ్ ఇండియా వశం చేస్తారా? ఆసక్తికరం!.
ఓ టెస్టు ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచులు అందుకున్న వికెట్ కీపర్గా దిగ్గజం ఎం.ఎస్ ధోని రికార్డును యువ రిషబ్ పంత్ సమం చేశాడు. ఆడిలైడ్లో పంత్ ఆరు క్యాచులు అందుకోగా, 2009 వెల్లింగ్టన్ టెస్టులో ధోని ఆరు క్యాచులు అందుకున్నాడు.
ఆస్ట్రేలియా గడ్డపై 1000 పరుగులు చేసిన నాల్గో భారత బ్యాట్స్మన్గా కోహ్లి రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ (1809), వీవీఎస్ లక్ష్మణ్ (1236), రాహుల్ ద్రవిడ్ (1143) ఈ జాబితాలో ముందున్నారు. సచిన్ వెయ్యి పరుగులకు 20 టెస్టులు ఆడగా, కోహ్లి 9 టెస్టుల్లోనే ఈ ఘనత దక్కించుకున్నాడు.