Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్ర, ఢిల్లీ రంజీ మ్యాచ్
న్యూఢిల్లీ : వీడ్కోలు వేళ గౌతం గంభీర్ (112, 185 బంతుల్లో 10 ఫోర్లు) శతకబాదాడు. ఆంధ్రాతో రంజీ మ్యాచ్కు ముందు క్రికెట్కు గుడ్బై ప్రకటించిన గంభీర్.. ఆదివారం ఆఖరి సారి మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. గంభీర్ శతకానికి తోడు కెప్టెన్ దృవ్ శోరె (98), దలాల్ (58) రాణించటంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ 409/7తో ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రా 390 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ' వీడ్కోలు సైతం నాకు సంతోషమిచ్చింది. ఆఖరి ఇన్నింగ్స్లో శతకం బాదాను. నాకు నేనుగా శత్రువులను తయారు చేసుకున్నానని అంటారు, నిజమే. కానీ క్రికెటింగ్ విషయాల్లో నేను నిజమని నమ్మిన విషయాలపైనే నిలబడ్డాను. యాంత్రికంగా ఉంటూ, మౌనంగా ఉండలేను. నేను నోరు విప్పితే దాన్ని వింతగా చూస్తే నాకేం ఇబ్బంది లేదు. అసంపూర్ణ కెరీర్, శత్రువులను తయారు చేసుకున్నా అని అంటున్నారు నిజమే, కానీ నేను ప్రతి రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ఎటువంటి పశ్చాత్తాపం లేదు' అని గంభీర్ పేర్కొన్నాడు.