Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌతం గంభీర్
- రాజకీయాల్లోకి రాను!
న్యూఢిల్లీ : క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన గౌతం గంభీర్ ఇక రాజకీయాల్లోకి రాబోతున్నాడని ఢిల్లీ క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతున్న నేపథ్యంలో గౌతీ స్పష్టతనిచ్చాడు. ' రాజకీయాల్లోకి వస్తానంటూ వస్తోన్న పుకార్లు నా దృష్టికి వచ్చాయి. సోషల్ మీడియాలో సామాజిక అంశాలపై స్పందిస్తుండటం అందుకు కారణం కాబోలు. కానీ అటువంటి ఉద్దేశం లేదు. వీడ్కోలు తర్వాత అత్యున్నత స్థాయిలో కోచ్గా అదృష్టం పరీక్షించుకోవాలనే ఆలోచన ఉంది. ఏం జరుగుతుందో చూడాలి' అని ఆంధ్రాతో చివరి రంజీ మ్యాచ్ అనంతరం గంభీర్ పేర్కొన్నాడు. 2011 వరల్డ్కప్, 2007 టీ20 ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడైన గౌతం గంభీర్ ఇటీవలే వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దిగ్గజ కెప్టెన్ ఎం.ఎస్ ధోనితో విభేదాలను గంభీర్ వీడ్కోలు వేళ మరోసారి బయటపెట్టాడు!. 2012 ఆస్ట్రేలియాలో ముక్కోణపు వన్డే సిరీస్లో ధోని నాయకత్వంపై విమర్శలు సంధించాడు. ' జట్టులో ముగ్గురు ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్, గంభీర్ ఉన్నారు. యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వటం కోసం కేవలం ఇద్దరికి మాత్రమే తుది జట్టులోకి చోటు ఇవ్వగలను. 2015 వన్డే ప్రపంచకప్ కోసమే ఈ సన్నద్ధత అని తెలిపాడు. ప్రపంచకప్కు మూడేండ్ల ముందుగానే మీరు వరల్డ్కప్లో ఉండబోరు ఓ కెప్టెన్ ఏ విధంగా చెప్పగలడు?' అని గంభీర్ ప్రశ్నించాడు. ఆ సిరీస్లో ధోని సారథ్య వ్యూహ వైఫల్యంతోనే భారత్ ఫైనల్స్కు చేరలేదని గంభీర్ విమర్శించాడు.