Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 35-31తో హర్యానాపై గెలుపు
విశాఖపట్నం : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్6లో తెలుగు టైటాన్స్ సొంతగడ్డపై జోరందుకున్నది. ఓటమితో విశాఖ మ్యాచులను మొదలెట్టిన టైటాన్స్.. వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్యానా స్టీలర్స్పై 35-31తో నాలుగు పాయింట్ల తేడాతో గెలుపొందింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 12 పాయింట్లతో రాణించగా, నీలేశ్ సాలూంకే 7, విశాల్ భరద్వాజ్ 6లు మెరిశారు. డిఫెండర్ అనిల్ కుమార్ మూడు ట్యాకిల్స్తో హర్యానా రైడర్లను కట్టడి చేశాడు. హర్యానా తరఫున మోను గోయత్ 12 పాయింట్లు తీసుకురాగా, వికాశ్ ఖండోలా ఏడు పాయింట్లతో రాణించాడు. కుల్దీప్ సింగ్ 3, మయూర్ 2 ఫర్వాలేదనిపించారు. ఆఖరు మూడు నిమిషాల మ్యాచ్ ఉందనగా 28-29తో పోటీనిచ్చిన హర్యానా.. చివర్లో పట్టు కోల్పోయింది. తెలుగు టైటాన్స్కు ఆధిక్యం కోల్పోయింది. సొంతగడ్డపై రెండో విజయంతో తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకున్నది.