Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మకాటి సిటీ : భారత చెస్ ప్లేయర్లు లలిత్ బాబు, విదిత్ గుజరాతి, అభిజిత్ కుంటెలపై ఫిలిప్పీన్స్ నగరం లోని మకాటిలో వీధి రౌడీలు దాడి చేశారు. ఆసియా కాంటి నెంటల్ టోర్నీ కోసం మకాటికి వెళ్లిన భారత ప్లేయర్లకు హోట ల్లో సరైన సదుపాయాలు కల్పించలేదు. మంచి నీళ్ల కోసం బయటకు వెళ్లగా వీధి రౌడీలు చుట్టుముట్టారు. వారి బారి నుంచి తప్పించుకుని హోటల్ చేరుకున్న చెస్ ప్లేయర్లు, నిర్వాహకులకు విషయాన్ని తెలుపగా స్పందిం చలేదు. స్థానిక పోలీసులు సైతం చెతులెత్తేశారు. దీంతో ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా విదిత్ గుజరాతీ వెల్ల డించారు. భారత చెస్ అధి కారులు స్పందించి, అక్కడి భారత రాయబార కార్యాలయా నికి తెలియజేశారు. టోర్నీ ఏర్పాట్లపైనా ఫిడెకు విదిత్ ఫిర్యాదు చేశారు.