Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిసారి టెస్ట్ సీరిస్పై టీమిండియా నజర్
- మొదటి రెండు మ్యాచ్లు గెలిచే వ్యూహం
- నేటి నుంచి ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్టు
- మిండియాలో కీలకఆటగాళ్లు లేకుండానే...
పెర్త్: దశాబ్దాల కింద చేసిన ప్రయోగాన్ని మరోసారి చేయటానికి టీమ్ ఇండియా సన్నద్ధమైంది. శుక్రవారం రెండో టెస్టుకు భారత్ రెడీ అయ్యింది. 1978లో వరుసగా రెండు టెస్టు మ్యాచ్లు గెలిచింది. కానీ ఆ రెండు మ్యాచులు చివరి మూడు,నాలుగు కావటం విశేషం. ఇపుడు అలాంటి ఫీట్ సాధించాలని టీమ్ ఇండియా తహతహలాడుతున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఆడుతున్న ఈ సీరిస్లో తొలి టెస్టును భారత్ కైవసం చేసుకున్నది. 31 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడించింది. ఇదే ఊపుతో మరోటెస్టును గెలుచుకుంటే...పాత రికార్డులను తిరగరాయాలనుకుంటున్నది టీమ్ ఇండియా. కానీ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన 71 మ్యాచుల్లో భారత జట్టు కేవలం ఆరు మ్యాచ్లను మాత్రమే గెలిచింది. భారత్ వరుసగా రెండు సిరీస్లను కైవసం చేసుకున్న ఘటన కేవలం 1977లో మాత్రమే సాధ్యమైంది. అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ బిషన్సింగ్ బేడీ నేతృత్వంలో మెల్బోర్న్,సిడ్ని టెస్టులను గెలిచింది. అయితే మెల్బోర్న్లో ఆడిన మూడోటెస్టు,సిడ్నీలో ఆడినది నాలుగోటెస్టు కావటం విశేషం. ఇపుడు విరాట్ కోహ్లి కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో ఆడబోయే రెండోటెస్టు గెలిచి..నయా రికార్డు సృష్టించాలని టీమ్ ఇండియా ఆశిస్తున్నది.
వాకా గ్రౌండ్ మాదిరిగానే ఫాస్ట్ బౌలర్లకు మేలు..
వాకా గ్రౌండ్ పిచ్ ఎప్పుడూ ఫాస్ట్ బౌలర్లకు సపోర్టు దొరుకుతుంది.అచ్చం అలానే ఆప్టస్ స్టేడియంను ఆ విధంగానే మలిచారు. ఆస్ట్రేలియ కోచ్ జస్టిస్ లాంగర్ మాట్లాడుతూ ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలంగా పిచ్ ఉన్నదని తెలిపాడు.
టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ వైపే..
టాస్ గిలిచిన జట్టు మొట్టమొదటగా బౌలింగ్ చేయటానికి సిద్ధమవుతుందని సిప్థోర్ప్ అన్నాడు. పిచ్ ఉన్న తీరు చూస్తే..ఐదు రోజుల్లో మ్యాచ్ పూర్తయ్యేఛాన్స్ ఉన్నదని చెప్పాడు.
టెస్టుకు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ
ఆతిథ్య జట్టు అయిన ఆస్ట్రేలియాపై ఆడిన తొలి టెస్టులో మట్టికరిపించిన టీమిండియాకు రెండో టెస్టు ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్ వేదికగా జరిగే ఈ టెస్టుకు గాయం కారణంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, బ్యాట్స్మన్ రోహిత్ శర్మ దూరమయ్యారు. మరోవైపు గాయంతో తొలి టెస్టుకు దూరమైన ఓపెనర్ పృథ్వీషా ఇంకా కోలుకోలేదు. దీంతో వీరి స్థానాల్లో హునుమ విహారీ, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ను ఎంపిక చేశారు.
'పృథ్వీ షా గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అతడికి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతున్నది. పొత్తి కడుపులో నొప్పి కారణంగా స్పిన్నర్ అశ్విన్ రెండో టెస్టుకు దూరమవుతున్నాడు. వెన్నునొప్పి కారణంగా రోహిత్ శర్మ కూడా ఈ టెస్టులో ఆడట్లేదు' అని బీసీసీఐ వెల్లడించింది. వీరి స్థానంలో జడేజా, హునుమ విహారీ, భువనేశ్వర్కుమార్, ఉమేశ్ యాదవ్కు జట్టులో స్థానం కల్పించింది.
ఇప్పటికే ఒక టెస్టు మ్యాచ్ గెలిచి
మంచి ఊపుమీదఉన్న టీమిండియా జట్టు రెండో టెస్టు గెలిచి..
ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవాలన్న కసితో ఉన్నది. కానీ టీమిండియాకు అశ్విన్ లేకపోవడం ఎదురుదెబ్బఅని జట్టు సభ్యులు అంటున్నారు. ఎందుకంటే అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు పెర్త్ పిచ్ టీమిండియా కంటే ఆసీస్ ఆటగాళ్లకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. భార్త్ చేతిలో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టు ఫాస్ట్ బౌలింగ్ అస్త్రాలు ప్రయోగించటానికి సిద్ధమైంది. మరీ ఈ టెస్టు పోటీలో ఎవరిది పై చేయి అవుతుందోనని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆస్ట్రేలియాలో టెస్టు గ్రౌండ్లలో టీమ్ఇండియా ప్రదర్శన
స్టేడియం టెస్టు గెలుపు ఓటమి డ్రా
అడిలైడ్ 12 2 7 3
బెలేరివ్,హౌబార్ట్ 0 0 0 0
బ్రిస్బేన్ 6 0 0 1
కేజెలీ,క్యార్నస్ 0 0 0 0
ఎగ్జిబిషన్,బ్రిస్బేన్ 0 0 0 0
మరారా,డార్విన్ 0 0 0 0
మెల్బోర్న్ 12 3 8 2
సిడ్ని 11 1 5 5