Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్కు నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ - ప్రపంచకప్ హాకీ
భువనేశ్వర్ : 14వ ప్రపంచకప్ సెమీఫైనల్లోకి నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా జట్లు ప్రవేశించాయి. గురువారం జరిగిన హోరాహోరీ పోరులో ఆతిథ్య భారత్ 1-2 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడి టోర్నీనుంచి నిష్క్రమించింది. దీంతో 43 ఏళ్ల తర్వాత హకీ ప్రపంచకప్ సెమీఫైనల్లో ప్రవేశించాలని ఉవ్విళ్లూరిన ఆతిథ్య భారత్కు ఎదురుదెబ్బ తప్పలేదు. మ్యాచ్ ప్రారంభమైన 12వ నిమిషంలో ఆకాష్దీప్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసి భారత్కు 1-0 ఆధిక్యతను చేకూర్చాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ తరఫున టెర్రీ బ్రింక్మన్ 15వ నిమిషంలో గోల్ చేసి తొలి క్వార్టర్లోనే ఇరుజట్లు ఒక్కో గోల్ నమోదు చేసుకొని 1-1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత రెండు, మూడు క్వార్టర్లలో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. నాల్గో క్వార్టర్ 50వ నిమిషంలో డచ్కు చెందిన మిక్-వన్-డెర్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి 2-1 ఆధిక్యతను చేకూర్చాడు. ఆ తర్వాత 53వ నిమిషంలో భారత్కు చెందిన అమిత్ పసుపు కార్డుకు గురై ఐదు నిమిషాలు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. 10మంది ఆటగాళ్లతో చివరి సమయంలో మ్యాచ్ ఆడడంతో భారత్ గోల్ చేసే అవకాశం లేకపోయింది. దీంతో నిర్ణీత సమయానికి నెదర్లాండ్ 2-1 గోల్స్ ఆధిక్యతలో నిలిచి సెమీస్లోకి దూసుకెళ్లింది. అంతకముందు జరిగిన తొలిమ్యాచ్లో బెల్జియం జట్టు 2-1 గోల్స్ తేడాతో పటిష్ట జర్మనీపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
సెమీఫైనల్స్
డిసెంబర్ 15 : ఇంగ్లాండ్×బెల్జియం (సా. 4.00 గం||లకు)
ఆస్ట్రేలియా×నెదర్లాండ్స్ (రా. 6.30 గం||లకు)
డిసెంబర్ 16 : కాంస్య పతక పోరు (సా. 4.30 గం||లకు)
ఫైనల్ (రా. 7.00 గం||లకు)