Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ..20 ఫార్మాట్లో టోర్నమెంట్
లాహౌర్: పాకిస్థాన్ సొంతగడ్డపై క్రికెట్ నిర్వహణకు అనుమతి లభించింది. పాక్ ఆతిథ్యంలో ఆసియాకప్ 2020 నిర్వహించేందుకు సన్నాహాలు షురూ చేసింది. అయితే మ్యాచ్లు ఆడే ప్రాంతాల ఎంపికను ఇంకా ఖరారు చేయలేదు. ఒక వేళ పాక్లో మ్యాచ్లు జర గకపోతే..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని మైదానాల్లో పోటీలు జరిగేఅవకాశాలున్నాయి. ఆసియాకప్ 2020 సెప్టెంబర్లో టీ..20 ఫార్మాట్లో ఆయా జట్లు ఆడాల్సిఉంటుంది. ఆస్ట్రేలియాలో జరగబోయే టీ..20 వరల్డ్ కప్ కన్నా ముందుగా ఏషియాకప్ జరిగేలా ప్లాన్ చేశారు. భారత్,పాక్ల మధ్య ఉన్న సంబంధాల కార ణంగా..మరోసారి ఆసియా కప్ మరోసారి యూఏఈలో జరిగే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. గత ఆసియా కప్ను భారత్ ఆతిథ్యం లభించింది. కానీ భారత్లో ఆడేందుకు పాక్ సమ్మతించకపోవ టంతో..బీసీసీఐ నేతృత్వంలో టోర్నమెంట్ను యూఏఈ లోనే నిర్వహించాల్సివచ్చింది. సెప్టెంబర్లో జరగబోయే ఆసియా కప్ కూడా యూఏఈలోనే నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.