Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గచ్చిబౌలిలోని ఓరియాన్ విల్లాస్లో వీరు శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యుల మధ్య వీరి వివాహ వేడుక అత్యంత నిరాడంబరంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబసభ్యుల అంగీకారంతో పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. వివాహ మహోత్సవంలో భాగంగా కశ్యప్ గృహంలో ఉపనయనం, పూజా కార్యక్రమం జరిగింది. బంధువులు, శ్రేయోభిలాషుల రాకతో సైనా, కశ్యప్ల గృహాలు సందడిగా మారాయి. ఆదివారం ఈ జంట ఇచ్చే వివాహ విందుకు కేటీఆర్, చిరంజీవి, కోచ్ పుల్లెల గోపీచంద్ తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిసింది.