Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్
ఇంటర్నెట్ డెస్క్: పెర్త్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టుకు రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకుని ఉంటే బాగుండేదని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు. జడేజాను పెర్త్ పిచ్లపై ఆడించి ఉంటే టీమిండియా బ్యాటింగ్ బలం మరింత పెరిగేదని పేర్కొన్నారు. గాయం కారణంగా రెండో టెస్టుకు రోహిత్ శర్మ, అశ్విన్ దూరం కావడంతో వారి స్థానంలో హనుమ విహారి, ఉమేశ్యాదవ్లకు చోటు కల్పించారు. దీంతో ఆయన ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెర్త్లో జడేజాను ఆడించకుండా టీమిండియా పొరపాటు చేసిందన్నారు. బౌలింగ్కు కాకుండా ఎనిమిదో నంబరు బ్యాట్స్మెన్గా జడేజాను పంపవచ్చన్నారు. ప్రస్తుతం టీమిండియా జట్టులో బౌలర్ల సంఖ్య పెరిగి బ్యాట్స్మెన్ సంఖ్య తగ్గిందన్నారు. ఆస్ట్రేలియా ఈ టెస్టులో గెలవడానికి ఇది కూడా కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు.