Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-32 కాదు..48 జట్లకు అవకాశం
-ఖతార్లో టోర్నమెంట్లు .ఫిఫావెల్లడి
దోహా: 2022లో ఖతార్లో జరగబోయే ఫిఫా వరల్డ్కప్ మ్యాచుల్లో 32 జట్లు కాకుండా,48 టీములు ఆడే అవకాశాలున్నాయి. దీనిపై ఆయా దేశాలతో ఫెడరేషన్ చర్చిస్తున్నది.తుది నిర్ణయం మాత్రం వచ్చే ఏడాది మార్చిలో తీసుకోవచ్చు. గత ఏడాది టోర్నమెంట్లో 32 జట్ల చోట 48 టీములను భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ విధానం 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నది.
క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లో 60కి పైగా దేశాలు.
దోహాకు చేరిన ఫుట్బాల్ సంస్థ ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫెనీటినో మాట్లాడుతూ..2022లో 48 దేశాల జట్లు టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం కల్పించేవిధంగా షెడ్యూల్ తయారుచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని ఫిఫాలో ఉన్న దేశాలు,ఫెడరేషన్లతో అభిప్రాయాలను కోరినట్టు చెప్పారు. ఎక్కువ దేశాలు దీనికి ఆమోదం తెలపటానికి సిద్ధంగా ఉన్నాయి. కేవలం 16 జట్లకు మాత్రం ప్రపంచకప్ మ్యాచుల్లో ఆడే అవకాశం ఉండదని, 50 నుంచి 60 దేశాలు క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లో ఆడతాయని వివరించారు.
2019 మార్చిలో తుదినిర్ణయం
ఫిఫాలో ఎన్ని జట్టు ఆడాలా..షెడ్యూల్ ఏవిధంగా ఖరారు చేయాలి..ఇలా పలు అంశాలపై 2019మార్చిలో నిర్ణయం తీసుకుంటామని గియానీ తెలిపారు. ఒకవేళ ఖతార్ మ్యాచులు నిర్వహణకు అంగీకరించకపోతే..మరో దేశంలో ఆడించటానికి ప్రత్యామ్నాయమార్గాలను ఆలోచిస్తామన్నారు. ఖతార్,సౌదీ అరేబియాల మధ్య ఉన్న వివాద నేపథ్యంలో..తనకు అంతస్పష్టంగా తెలియదని చెప్పారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధంలేదని..ప్రపంచ ఫుట్బాల్ కప్ నిర్వహించటమే పలు దేశాల స్వప్నమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒక్కరోజులో నాలుగు పోటీలు
2022 వరల్డ్కప్ మ్యాచులు నవంబర్ 21 నుంచి షురూ అయి డిసెంబర్ 18 వరకు జరుగుతాయి. వాస్తవానికి ఈ పోటీలు జూన్,జులై మధ్య జరుగుతుండేవి. అయితే ఖతార్లో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్లో మార్పులు చేసినట్టు ఆయన వివరించారు.ఈసారి టోర్నమెంట్లో ఒకేరోజు నాలుగు మ్యాచులు నిర్వహించేలా ప్రణాళికను రెడీ చేస్తున్నారు. 2018 రష్యాలో జరిగిన ప్రపంచ ఫుట్బాల్ కప్లో ఫ్రాన్స్ టీమ్ ఛాంపియన్ కితాబు దక్కించుకున్నది. ఖతార్లో నిర్వహించే టోర్నమెంట్ కోసం ఆరు స్టేడియంలను సిద్ధం చేస్తున్నారు. దీనికోసం 72వేల కోట్లు వెచ్చించనున్నారు.