Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షూటౌట్లో నెగ్గిన డచ్ జట్టు
- నేడు హాకీ ప్రపంచకప్ ఫైనల్స్
-ఇంగ్లండ్పై 6-0తో బెల్జియం ఘన విజయం
భువనేశ్వర్: భారత్లో జరుగుతున్న పురుషుల హాకీ ప్రపంచకప్లో బెల్జియం, నెదర్లాండ్స్ జట్లు తుదిపోరుకు చేరుకున్నాయి. శనివారం ఇక్కడ ముందుగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై బెల్జియం 6-0 గోల్స్తో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్ టోర్నిలో తొలిసారిగా తుదిపోరుకు చేరుకుంది. ఆట ప్రారంభమైన నుంచి ఇంగ్లాడ్పై బెల్జియం ఆధిపత్యం కొనసాగింది. ఆట 8వ నిమిషంలో టామ్ బూన్ తొలి గోల్ చేసి బెల్జియంకు అధిక్యం అందించాడు. తరువాత 19వ నిమిషంలో సిమోన్ గౌగ్నార్డ్ గోల్ సాధించాడు. తరువాత 42వ నిమిషంలో కెడ్రిక్ చార్లియర్ గోల్ చేశాడు. దీంతో బెల్జియం అధిక్యం 3-0కు చేరుకుంది. ఈ తరువాత 45, 50వ నిమిషాల్లో అలెగ్జాండర్ హెండ్రిక్స్ వరస గోల్స్ చేశాడు. దీంతో బెల్జియం అధిక్యం 5-0కు చేరుకుంది. ఈ తరువాత మళ్లీ 53వ నిమిషంలో సెబాస్టియన్ డాకైయిర్ గోల్ సాధించాడు. దీంతో బెల్జియం 6-0తో మ్యాచ్ను ముగించింది. తొలిసారి ఫైనల్స్కు చేరుకుంది. బెల్జియం జోరు కొనసాగిస్తుంటే ఇంగ్లాండ్ ఎలాంటి ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. కనీసం తన గోల్పోస్టును కూడా కాపాడుకోలేకపోయింది. దీంతో గత ప్రపంచకప్లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్న బెల్జియం ఈసారి ఫైనల్స్కు చేరుకుంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై నెదర్లాండ్స్ జట్టు 4-3తో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యచ్లో సమయం ముగిసే సరికి ఇరు జట్లు 2-2తో సమానంగా నిలిచాయి. దీంతో ఫలితం కోసం నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో బెల్జియం విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్లో టైటిల్ కోసం బెల్జియం, నెదర్లాండ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఆదివారం ముందుగా 4:30 గంటలకు ప్రారంభమైన మూడో స్థానం కోసం మ్యాచ్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి.