Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ 283 ఆలౌట్
- ఆధిక్యంలో ఆసీస్
పెర్త్: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగు తున్న రెండో టెస్టు ఫలితం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా అధిక్యంతో ఉంది. ఆదివారం ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. మొత్తంగా భార త్పై 175 పరుగుల అధిక్యంలో ఉంది. ఆసీస్ 250 కన్నా ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశిస్తే కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి నాలుగోరోజైన సోమ వారం ఆటలో ఆసీస్ను ఎంత త్వరగా ఆలౌట్ చేయడంపై భారత విజయవకాశాలు అధారపడి ఉంటాయి.
కాగా, ఆదివారం ఆటలో ముందుగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌటయింది. 172/3 ఓవైర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఆదిలోనే అజింక్యా రహానే (51 పరుగులు:105 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ను కోల్పోయింది. అనం తరం క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం హనుమ విహారితో కెప్టెన్ కోహ్లి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 214 బంతుల్లో 11 ఫోర్లతో కోహ్లి సెంచరీని అందుకున్నాడు. కోహ్లి కెరీర్లో ఇది 25వ టెస్టు సెంచరీ కావడం విశేషం. అయితే భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతూ క్రీజులో పాతుకుపోతున్న కోహ్లి-విహారి జోడిని హజల్వుడ్ దెబ్బతీశాడు. జట్టు స్కోరు 223 పరు గుల వద్ద హనుమ విహారిను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దీంతో 5వ వికెట్కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆసీస్ బౌలర్ల సమర్థవం తంగా ఎదుర్కొన్న విహారి 46 బంతుల్లో రెండు ఫోర్లతో 20 పరుగులు చేశాడు. విహారి అవుట్ తరువాత కూడా కోహ్లి దూకుడుగా ఆడాడు. వేగంగా పరుగులు చేశాడు. అయితే జట్టు స్కోరు 251 పరుగుల వద్ద కోహ్లి పెవిలి యన్ చేరుకున్నాడు. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి కోహ్లి బలయ్యాడు. 6వ వికెట్గా అవుటైన కోహ్లి 257 బంతుల్లో సిక్స్, 13 ఫోర్లతో 123 పరుగులు చేశాడు. కోహ్లి తరువాత నుంచి భారత్ వికెట్లను చకచకా కోల్పో యింది. కోహ్లి నిష్క్రమణ వెంటనే క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. షమీ తరు వాత ఇషాంత్ శర్మ (1) నిరాశపర్చాడు. ఈ సమయంలో మరో వైపు రుషిబ్ పంత్ కొంచెం సేపు దాటిగా ఆడాడు. 50 బంతుల్లో సిక్స్, రెండు ఫోర్లతో 36 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 279 వద్ద నాథన్ లయన్ బౌలిం గ్లో భారీ షాట్కు ప్రయత్నించిన పంత్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. చివరి వికెట్గా బుమ్రా ఔటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఉమేష్ యాదవ్ (4) నాటౌట్ గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో 5 వికెట్లతో స్పిన్నర్ లయన్ రాణించగా, స్టార్క్, హజల్వుడ్లకు రెండేసి వికెట్లు దక్కగా.. కమిన్స్కు ఒక వికెట్ దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలి యా ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 132 పరుగు లు చేసింది. ఖాజా 41 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అలాగే ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ (25 పరుగులు) గాయంతో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. మహ్మద్ షమీ వేసిన 13వ ఓవర్ తొలిబంతి.. ఫించ్ కుడి చూపుడు వేలుకు బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిలాడిన ఫించ్ మైదానం వీడాడు. అతన్ని ఎక్స్రే కోసం ఫిజియోలు ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రమైతే ఫించ్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.
కోహ్లి రికార్డు
ఆదివారం సెంచరీతో టెస్ట్ల్లో అత్యంత వేగంగా 25 టెస్టు సెంచరీలు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్ మన్గా కోహ్లి గుర్తింపు పొందాడు. 76 మ్యాచ్ లు.. 128 ఇన్నింగ్స్లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. అయితే బ్రాడ్ మన్ 52 మ్యాచ్లు.. 68 ఇన్నింగ్స్ల్లోనే 25 టెస్టులు సాధించాడు. అలాగే ఆసీస్ గడ్డపై ఆరు సెంచరీలు నమో దు చేసిన సచిన్ రికార్డును కోహ్లి సమం చేశాడు. అలాగే ఆస్ట్రేలియాలో అత్యంత వేగంగా (18 ఇన్నింగ్స్ల్లో) 1000 టెస్టు పరుగులు అందుకున్న భారత బ్యాట్స్మెన్గా నిలిచా డు. అలాగే ఈ ఏడాదిలో కోహ్లికి ఇది 5వ టెస్టు సెంచరీ.