Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మయాంక్ అగర్వాల్కూ చోటు
- సిరీస్కు దూరమైన పృథ్వీ షా
-ఆసీస్తో టెస్టులకు భారత జట్టు
ముంబయి : గాయం నుంచి కోలుకుని రంజీ మ్యాచ్లో సత్తా చాటిన హార్దిక్ పాండ్యకు సెలక్టర్లు పిలుపు నందించారు. పునరాగమనంలో ముంబయిపై ఏడు వికెట్లు సహా అర్ధ సెంచరీ సాధించిన హార్దిక్ పాండ్య ఫామ్, ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు హార్దిక్ పాండ్యతో పాటు మయాంక్ అగర్వాల్లను ఎంపిక చేస్తూ సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. సిడ్నీలో వార్మప్ మ్యాచ్లో చీలమండ గాయానికి గురైన యువ కెరటం పృథ్వీ షా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. పెర్త్ టెస్టుకు ముందు ఫిట్నెస్ పరీక్షలో షా పురోగతి సాధించలేదు. దీంతో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకున్నారు. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో జరిగే బాక్సింగ్ డే టెస్టులో పాండ్య, మయాంక్లు తుది జట్టులో చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.