Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆస్ట్రేలియా నేలపై అరుదైన ఆరంభ ఆధిక్యాన్ని కోహ్లిసేన నేలపాలు చేసేసింది. చారిత్రక సిరీస్కు పడిన గొప్ప అడుగును నాశనం చేసుకున్నది!. వ్యూహాత్మక తప్పిదాలతో పెర్త్లో పరాభవం పాలై సిరీస్ను సమం చేసుకున్నది. పెర్త్ ఓటమికి కోహ్లిసేన బ్యాటింగ్ వైఫల్యం ఓ కారణమే అయినా, కెప్టెన్ విరాట్ కోహ్లి తుది జట్టు ఎంపిక తప్పిదమే ఎక్కువ కారణమైందని చెప్పవచ్చు. పెర్త్ టెస్టులో తుది జట్టులో చోటు ఎవరికీ? అని ఐసీసీ ట్విట్టర్లో పోల్ పెట్టింది. 'నా ఓటు రోజర్ ఫెడరర్' అని ఓ అభిమాని స్పందించాడు. ఈ ఒక్క మాట చాలు పెర్త్ పిచ్పై నలుగురు బౌలర్లను ఆడించేందుకు కోహ్లి ఎందుకు మొగ్గుచూపాడో అని తెలుస్తుంది. అయితే ఆతిథ్య జట్టు ముందు రోజు స్పిన్నర్తో తుది జట్టును ప్రకటించింది. భారత జట్టు మేనేజ్మెంట్ పిచ్ను సరిగా అర్ధం చేసుకోక పోయినా, ఆతిథ్య జట్టు ఎంపికతోనైనా పునరాలోచన చేయాల్సింది. నలుగురు సీమర్లతోనే బరిలోకి దిగిన కోహ్లి స్పెషలిస్ట్ స్పిన్నర్ను పక్కనపెట్టాడు. కోహ్లి నిర్ణయం తప్పని తొలి రోజు తొలి గంటలోనే తేలిపోయింది. కానీ ఇక ఆ విషయంలో చేయాల్సింది ఏమీ లేకుండా పోయింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్ రెండు ఇన్నింగ్స్లో భారత ప్రధాన బ్యాట్స్మెన్ను ఇబ్బందికి గురిచేసి, ఆస్ట్రేలియాను గెలుపు బాటలో నిలిపాడు. ప్రధాన స్పిన్నర్ లేని భారత్, ఆ అవకాశాన్ని చేజేతులా కోల్పోయింది.
ఇక ప్రదర్శన పరంగా చూస్తే చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాకు ఓపెనర్లు గట్టి పునాది వేయగా, భారత ఓపెనర్లు జట్టుకు భారమయ్యారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 112, రెండో ఇన్నింగ్స్లో 59 పరుగుల భాగస్వామ్యం అందించారు. కానీ విజరు (0, 20), రాహుల్ (2, 0)లు జట్టుకు 22 పరుగులే జోడించారు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ వరుసగా 6, 0 పరుగుల వద్దనే తొలి వికెట్ కోల్పోయారు. ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ ఉన్న మ్యాచ్లో ఓపెనర్ల భాగస్వామ్యం ఆసీస్ను ఆధిక్యంలో నిలిపింది. ఇక లోయర్ ఆర్డర్లోనూ ఆసీస్దే హవా. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ టెయిలెండర్లు (8, 9, 10, 11 స్థానాల్లోని బ్యాట్స్మెన్) 34 పరుగులు జోడించారు. ఇదే ఆర్డర్లో భారత్కు 9 పరుగులే వచ్చాయి. ఇక రెండో ఇన్నింగ్స్లో స్టార్క్, హెజిల్వుడ్ 36 పరుగులు జోడించారు. కానీ భారత్ చివరి నాలుగు వికెట్లను 2 పరుగులకే చేజార్చుకున్నది. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయాన్ను ఎదుర్కొనేందుకు భారత బ్యాట్స్మెన్ వద్ద మెరుగైన వ్యూహం కొరవడింది. ఇదే సమ యంలో ఛేదనలో విరాట్ కోహ్లి నిష్క్రమణ, అలాగే తొలి ఇన్నింగ్స్లో వివాదస్పద క్యాచౌట్లు మ్యాచ్ను మలుపు తిప్పాయి. తొలి ఇన్నింగ్స్ లో కోహ్లి నాటౌట్గా నిలిచి ఉంటే, ఆతిథ్య జట్టుకు కచ్చితంగా ఆధిక్యం వచ్చేది కాదు. ఆ సమయంలో భారత అవకాశాలు ఉజ్వలంగా ఉండేవని చెప్పనక్కర్లేదు. బాక్సింగ్ డే టెస్టుకు హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్లు రానున్నారు. అంటే, మెల్బోర్న్లో భారత జట్టు కూర్పు మారనున్నది. ఓపెనర్లు, ఆల్రౌండర్ల కాంబినేషన్లో ఎంపికలు మెల్బోర్న్ విజయానికి దోహదం చేస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. కెప్టెన్ కోహ్లి ఈ విషయాన్ని గమనిస్తాడా మరి!
' పెర్త్ పిచ్ చూసిన వెంటనే నలుగురు సీమర్లు సరిపోతారనే అనిపించింది. అసలు ప్రధాన స్పిన్నర్ను తీసుకోవాలనే ఆలో చనే మా మదిలో లేదు. పెర్త్ టెస్టు ముగిసింది. స్పిన్నర్ను పక్కనపెట ్టడంపై పశ్చాత్తాపం లేదు. మా దృష్టి ఇప్పుడు బాక్సిండ్ డే టెస్టు గెలవ టంపైనే నెలకొన్నది'
- విరాట్ కోహ్లి