Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలుగు తేజం, మాజీ వరల్డ్ నం.1 బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ మెగా డీల్ కుదుర్చుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూర్ రాప్టర్స్ను విజేతగా నిలిపిన మరునాడే, శ్రీకాంత్ రూ. 35 కోట్ల ఒప్పందంపై సంతకం చేశాడు. ప్రముఖ క్రీడా ఉపకరణాల తయారీదారు, పలు దేశాల జట్లకు స్పాన్సర్ లీ నింగ్తో శ్రీకాంత్ ఈ మెగా డీల్ ఒకే చేశాడు. నాలుగేండ్ల కాలానికి శ్రీకాంత్ రూ. 35 కోట్లు అందుకోను న్నాడు. ' వరల్డ్ బ్యాడ్మింటన్లో శ్రీకాంత్ ఇప్పటికే ఆకర్షణీయ ఆటగాడు. శ్రీకాంత్ పురోగతిలో లీ నింగ్ సైతం భాగం కావాలని అనుకున్నది. మా డీల్ శ్రీకాంత్కు సరిగ్గా సరిపోతుంది' అని లీ నింగ్ భారత డైరెక్టర్ మహేంద్ర కపూర్ వెల్లడించారు.