Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లు మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) సిఇఓ రాహుల్ జోహ్రీకి వివరణ ఇచ్చారు. బిసిసిఐ వీరిద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాండ్యా బేషరతుగా క్షమాపణలు తెలియజేసిన సంగతి తెలిసిందే. వారిద్దరి నుంచి వివరణ అనంతరం బుధవారం నివేదికను క్రికెట్ పాలకుల కమిటీకి అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరిపై విచారణ పూర్తయిందని, తర్వాతి దశ అంబుడ్స్మన్ నియామకంతో మొదలవుతుందని వెల్లడించారు. సుప్రీం కోర్టు అంబుడ్స్మన్ను నియమిం చాల్సి ఉంది.
యువ క్రికెటర్ల కెరీర్ ముగిసేలా చర్యలు తీసుకోవద్దని సీఓఏ అధినేత వినోద్ రారు సూచిస్తున్నారు. కేవలం రెండు మ్యాచ్ల నిషేధం సరిపోతుందని తెలుపగా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వ్యవహారాన్ని బిసిసిఐ న్యాయశాఖ వద్దకు తీసుకెళ్లాలని పట్టుబడుతున్నారు. విచారణ పేరుతో సమయం గడపొద్దని త్వరగా తేల్చేయాలని రారు కోరుతున్నారు.