Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ సందర్భానికి తగిన విధంగా ఆడతాడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ అన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో అతడి ఆట అద్భుతమని ప్రశంసించాడు. ఈ సిరీస్లో అతడు వరుసగా రెండు అర్ధశతకాలు బాదిన సంగతి తెలిసిందే. 'మ్యాచ్లు ముగించడంలో ధోనీకి ఉన్న నైపుణ్యంతో భారత్ దశాబ్ద కాలంగా లబ్ధి పొందుతోంది. ఇప్పటికీ టీమిండియా ఆ ప్రయోజనం పొందుతోంది. తొలి వన్డేలో 4/3తో ఉన్నప్పుడు ధోనీ పూర్వఅనుభవాన్ని రంగరించి అర్ధసెంచరీని పూర్తిచేయడం అద్భుతమని పేర్కొన్నాడు. సిడ్నీలో అతడు నిదానంగా ఆడినప్పటికీ ఎందుకలా ఆడాడో మనం అర్థం చేసుకోవచ్చు. పరిస్థితిని అనుసరించి ఆడాడు. మిడిలార్డర్లో వచ్చి భిన్నమైన పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. అతడు 300 పైగా వన్డేలు ఆడాడు. ఎప్పుడెలా ఆడాలో ధోనీకి బాగా తెలుసు' అని గిలెస్పీ అన్నాడు. అలాగే విరాట్ కోహ్లీపై గిలెస్పీ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ 39 శతకాలు, సచిన్ కన్నా 50 తక్కువ ఇన్నింగ్సుల్లోనే 10,000 పరుగులు చేశాడు. జట్టు విరాట్పై కాస్త అతిగా ఆధారపడుతున్నా మిడిలార్డర్ బాగుంది' అని గిలెస్పీ అన్నాడు.