Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్
- ఫిట్నెస్ కాపాడుకోవడమే ముఖ్యం
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వంద సెంచరీలు సాధిస్తాడని మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ జోస్యం చెప్పాడు. కానీ ఫిట్నెస్ను కాపాడుకోవడమే అతని ముందున్న ప్రధాన బలహీనతని తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ మరే ఆటగాడికి అందనంత ఎత్తులో సెంచరీలు సాధిస్తున్నాడని, ఇప్పటికే వన్డేలు, టెస్టులో కలిపి 64 సెంచరీలు పూర్తి చేసి సచిన్, పాంటింగ్ తర్వాతి స్థానంలో ఉన్నాడన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్, 71 సెంచరీలతో రికీ పాంటింగ్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన నేపథ్యంలో వీరి రికార్డును బ్రద్దలు కొట్టగల సత్తా ఉన్న ఏకైక ఆటగాడు ఒక్క విరాట్ మాత్రమే అని కొనియాడాడు. అంతేగాక విరాట్ ఫామ్ చూస్తుంటే ఆ ఫీట్ను త్వరగా బ్రేక్ చేయగల సత్తా ఉన్న విరాట్కు ఉందని మహ్మద్ అజారుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ఆడిలైడ్లో ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో విరాట్ సెంచరీని పూర్తి చేయడంతో ద్వారా అంతర్జాతీయంగా వన్డేల్లో 39వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెస్టులు, వన్డేల్లో కలిపి విరాట్ ఇప్పటివరకు 64 సెంచరీలు పూర్తి చేసినట్లైంది.
'విరాట్ కోహ్లీ నిలకడగా బాగా ఆడుతున్నాడు. ఫిట్గా ఉంటే 100 సెంచరీల మార్క్ను కచ్చితంగా చేరుకుంటాడు. కోహ్లీ సెంచరీ చేసిన చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే టీమిండియా ఓడిపోయింద'ని అజారుద్దీన్ పేర్కొన్నాడు. అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై కూడా అజర్ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా ధోని బాగా బ్యాటింగ్ చేశాడని, చివరివరకు వికెట్ కాపాడుకుని విన్నింగ్ షాట్ కొట్టడం అతడికే చెల్లిందని మెచ్చుకున్నాడు. దినేశ్ కూడా బాగా బ్యాటింగ్ చేశాడని, మొత్తంగా టీమిండియా ప్రదర్శన బాగుందని, వన్డే సిరీస్ను చేజిక్కించుకోవడం ఖాయమని చెప్పుకొచ్చాడు.