Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో వన్డేలో భారత్ ఘనవిజయం
అడిలైడ్ : ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ధోని ఫినిషింగ్ టచ్తో టీమిండియాకు విజయాన్ని ఖాయం చేశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. షాన్ మార్ష్ (131) అద్భుత సెంచరీకి తోడు మాక్స్వెల్(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. భువనేశ్వర్కు నాలుగు, షమికి మూడు, జడేజా ఒక వికెట్ లభించాయి. అనంతరం 299 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన భారత్కు ఓపెనర్లు శిఖర్ ధావన్ (32), రోహిత్ శర్మ(43)లు తొలి వికెట్కు 7.4 ఓవర్లలో 47 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. రెండో వికెట్కు కోహ్లీ-రోహిత్ 54 పరుగులు జోడించిన అనంతరం రోహిత్ క్యాచ్ఔట్గా వెనుదిరిగాడు. రాయుడు(24) నిరాశపర్చినా మూడో వికెట్కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇక ధోనీ రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. కోహ్లీ 105 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో కెరీర్లో 39వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆఖరికి రిచర్డ్సన్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన మ్యాక్స్వెల్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. చివర్లో ధోనీ పూర్వపు ఫామ్ను అందుకొని ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో బెహ్రన్డార్ఫ్ వేసిన తొలిబంతిని ఎంఎస్ సిక్సర్గా మలిచి టీమిండియాకు విజయాన్ని ఖాయం చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీకి దక్కింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక ఆఖరి వన్డే శుక్రవారం మెల్బోర్న్లో జరగనుంది.