Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండైన హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లు తప్పు తెలుసుకొన్నారు కాబట్టి వారి తప్పును సరిదిద్దుకోవడానికి ఓ అవకాశమిస్తే మరింత మెరుగవుతారని గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'పొరపాట్లు చేయడం సహజమని, వాటిపై తీవ్రంగా స్పందించొద్దు. తప్పు చేసినవారు దాన్ని తెలుసుకొని మరింత మెరుగైన వ్యక్తిగా మారతారని నమ్మకముంది. తప్పు చేయకుండా ఉండటానికి మనమేమీ యంత్రాలం కాదు మనుషులం. ఇక ముందుకెళ్లి మరోసారి ఇలాంటిది జరగకుండా చూసుకోవాలి' అని గంగూలీ కోరాడు. ఈ తరం క్రికెటర్లలో విరాట్ కోహ్లీ, ధోనీలు ఆదర్శనీయులు. ఒకప్పుడు గవాస్కర్, ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ కెరీర్ ముగియగానే తర్వాత ఎవరు? అని ఆలోచించారు. ఇప్పుడా ప్రశ్నకు జవాబు విరాట్. చాలామంది క్రికెటర్లు స్వతహాగా మంచి మనుషులు. మధ్య తరగతి నుంచి పోరాడి ఈ స్థాయికి వస్తారు. కోట్ల మంది క్రికెట్ ఆడేవారిలో 11 మందిని ఎంపిక చేస్తారంటేనే మనం ఊహించుకోవచ్చు' అని గంగూలీ అన్నారు.