Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఓఏకు ఖన్నా సూచన
న్యూఢిల్లీ : ఓ టీవీ షోలో మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హార్దిక్ పాండ్య, కెఎల్ రాహుల్లను విచారణ ముగిసే లోపు జాతీయ జట్టుకు ఆడనివ్వాలని పాలకుల కమిటీకి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సి.కె ఖన్నా సూచించారు. ' వారు తప్పు చేశారు. ఇప్పటికే బేషరతు క్షమాపణలు కోరారు. ఆసీస్ పర్యటన నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. అంబుడ్స్మన్ నియామకం కోసం కొందరు ఎస్జీఎం డిమాండ్ చేశారు. కానీ వచ్చే వారం సుప్రీంకోర్టు దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నది. మళ్లీ ఎస్జీఎం అవసరం లేదు. విచారణ జరిగేలోపు వారిని సస్పెన్షన్లో ఉంచకుండా, ఆడనివ్వాలి. వీలైనంత త్వరగా న్యూజిలాండ్లో భారత జట్టుతో కలిసేలా చేయటం మంచిది' అని వినోద్ రారుకు రాసిన లేఖలో ఖన్నా కోరారు. రారు సైతం రెండు వన్డేల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, సీఓఏ సభ్యురాలు ఎదుల్జీ న్యాయ సలహా కోరటంతో ఇప్పుడు విషయం అంబుడ్స్మన్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. మాజీలు సైతం యువ క్రికెటర్లకు మరో అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు. దీంతో వినోద్ రారు సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.