Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీతో రంజీ క్వార్టర్స్
లక్నో : రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఉత్తరప్రదేశ్పై 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదేసి, రికార్డు నెలకొల్పింది. హర్విక్ దేశారు (116) తొలి రంజీ శతకంతో చెలరేగగా.. చతేశ్వర్ పుజార (67 నాటౌట్), స్నీల్ పటేల్ 72, షెల్డన్ జాక్సన్ 73 నాటౌట్) రాణించటంతో సౌరాష్ట్ర రంజీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 195/2తో మరో 177 పరుగుల కోసం బరిలోకి దిగిన సౌరాష్ట్ర శతక హీరోను తొలి సెషన్లోనే కోల్పోయింది. కానీ పుజార, జాక్సన్లు పరిణితి చూపించారు. తొలుత డిఫెన్స్తో విసిగించి, తర్వాత పరుగుల వేటలో జోరందుకున్నారు. దీంతో సౌరాష్ట్ర మరో ఆరు వికెట్లు ఉండగానే విజయాన్ని అందుకున్నది. సెమీఫైనల్లో కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడనుండగా.. మరో సెమీస్లో విదర్బ, కేరళలు పోటీపడనున్నాయి.