Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానెకు భారత్-ఎ జట్టు పగ్గాలు అప్పగించారు. ఇంగ్లాండ్ లయన్స్తో ఐదు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచులకు సెలక్షన్ కమిటీ శనివారం జట్లను ప్రకటించింది. తొలి మూడు వన్డేలకు రహానె కెప్టెన్సీ వహించనుండగా, చివరి రెండు మ్యాచులకు అంకిత్ భవ్నె కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వన్డే మ్యాచులు జనవరి 23 నుంచి తిరువనంతపురంలో జరుగనున్నాయి. నాలుగు రోజుల మ్యాచులకు వయాండ్ (కేరళ), మైసూర్ (కర్ణాటక)లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. రంజీ సెమీస్కు చేరిన జట్ల నుంచి ఎ జట్టుకు ఎవరినీ ఎంపిక చేయలేదు. తెలుగు కుర్రాడు తొలి మూడు వన్డేలకు ఎంపికయ్యాడు.