Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో సైనా, సింధు, కిదాంబి
- నేటి నుంచి ఇండోనేషియా మాస్టర్స్
జకర్తా : కొత్త ఏడాది, కొత్త సీజన్లో భారత బ్యాడ్మింటన్ అగ్ర క్రీడాకారులు టైటిల్ వేట జకర్తాకు చేరుకున్నది. మలేసియా మాస్టర్స్లో సెమీస్ వరకూ వెళ్లిన సైనా నెహ్వాల్.. తాజాగా జకర్తాలోనూ టైటిల్పై కన్నేసింది. ఈ ఏడాది తొలిసారి బరిలోకి దిగుతోన్న తెలుగు తేజం పి.వి సింధు శుభారంభం ఆశిస్తోంది. మరోవైపు మలేషియాలో విఫలమైన కిదాంబి శ్రీకాంత్ ఇక్కడైనా టైటిల్ కొట్టాలనే తపనతో ఉన్నాడు. ముగ్గురు భారత స్టార్ షట్లర్లు టైటిల్ వేటలో నిలువగా ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ నేటి నుంచి ఆరంభం కానున్నది. పీబీఎల్ తర్వాత విరామం తీసుకున్న రెండో సీడ్ సింధు.. క్వార్టర్ఫైనల్లో ప్రియ ప్రత్యర్థి కరొలినా మారిన్తో తలపడే అవకాశం కనిపిస్తోంది. తొలి రౌండ్లో క్వాలిఫయర్తో తలపడనున్న సైనాకు క్వార్టర్స్లో నాల్గో సీడ్ అకానె యమగూచి ఎదురు కానున్నది!. మెన్స్ సింగిల్స్లో శ్రీకాంత్తో పాటు సమీర్ వర్మ, బి. సాయిప్రణీత్, హెచ్.ఎస్ ప్రణరులు ఇండోనేషియా బరిలో నిలిచారు. ఈ ఏడాది వరల్డ్ టూర్ ఫైనల్స్ సహా పీబీఎల్లో రాణించిన సమీర్ వర్మ ఇండోనేషియా టైటిల్పై కన్నేశాడు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జోడీ, మిక్స్డ్ డబుల్స్లో అశ్విని, సాత్విక్సాయిలపై మెడల్ ఆశలు ఉన్నాయి.