Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రస్థానంలోనే సారథి, జట్టు
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబారు : ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం సాధించిన టీమ్ ఇండియా, కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం మరింత పదిలం చేసుకున్నారు. 116 పాయింట్లతో భారత్ నం.1 జట్టుగా కొనసాగుతుండగా, 922 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లి నం.1 బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. సోమవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ సహా కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాట్స్మన్ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్సన్ రెండో స్థానంలో ఉండగా, అతడిపై కోహ్లి 25 పాయింట్ల ముందంజలో ఉన్నాడు.
చారిత్రక సిరీస్ విజయంలో కీలక భూమిక వహించిన చతేశ్వర్ పుజార మూడో స్థానంలో నిలిచాడు. టాప్-20లోకి అడుగుపెట్టిన యువ రిషబ్ పంత్ కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. పంత్ ప్రస్తుతం 17వ స్థానానికి చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో రబాడ అగ్రస్థానంలో ఉండగా, భారత సీమర్ బుమ్రా 15వ స్థానంలో ఉన్నాడు. అశ్విన్, జడేజాలు వరుసగా ఐదు, తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నారు.