Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది చివర్లో రీ ఎంట్రీ!
నవతెలంగాణ, హైదరాబాద్ : భారత టెన్నిస్ స్టార్, మహిళల డబుల్స్ మాజీ వరల్డ్ నం.1 సానియా మీర్జా ఏడాది చివర్లో పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. 2017లో చివరగా టెన్నిస్ కోర్టులో మెరిసిన సానియా మీర్జా అప్పట్లో మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. ఈ తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా మాతృత్వ విరామంలో కొనసాగుతోంది. ప్రసవానంతరం పెరిగిన బరువును కఠోర కసరత్తులతో అదుపు చేసుకున్న సానియా మీర్జా ఇప్పుడు మళ్లీ పూర్వపు రూపు సంతరించుకున్నది. ' పెరిగిన బరువు తగ్గాను. మరో పది రోజుల్లో ట్రైనర్ రానున్నాడు. ఇక నుంచి టెన్నిస్కు అవసరమైన ప్రత్యేక కసరత్తులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. 32 ఏండ్ల వయ సులో గొప్పగా టెన్నిస్ ఆడేలా ప్రస్తుతం లేను. కానీ స్టెఫీ గ్రాఫ్ స్ఫూర్తిగా మళ్లీ రాకెట్ పట్టబోతు న్నాను. టెన్నిస్ లేకుంటే నా జీవితమే లేదు. టెన్నిస్ ఆడకుండా ఉండలేను. ఈ ఏడాది చివర్లో మళ్లీ ప్రొఫెషనల్ కెరీర్ను పున ప్రారంభిస్తా నని ఆశిస్తున్నాను' అని సానియా తెలిపింది. ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రాంగణంలో నూతన టెన్నిస్ కోర్టును ప్రారంభించిన సానియా మీడియాతో మాట్లాడింది.