Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్తో చివరి టీ20 నేడే
హామిల్టన్ : వన్డే సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకున్న టీమ్ ఇండియా అమ్మాయిలు, టీ20 సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే కోల్పోయారు. మిథాలీరాజ్ సారథ్యంలో వన్డే సిరీస్ గెల్చుకోగా, హర్మన్ప్రీత్ నాయకత్వంలో పొట్టి పోరులో తేలిపోయారు. నేడు నామమాత్రపు మ్యాచ్లో అమ్మాయిలు ఊరట విజయం కోసం పోరాడనున్నారు. ఓపెనర్ స్మృతీ మంధాన, జెమీమా రొడ్రిగస్ మినహా బ్యాటింగ్ లైనప్లో ఎవ్వరూ ఫామ్లో లేరు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉన్నది. వరుసగా మూడు టీ20ల్లో (టీ20 సెమీఫైనల్స్తో కలిపి) తుది జట్టులో చోటు కోల్పోయిన మిథాలీరాజ్, ఇక్కడైనా ఆడుతుందో లేదో చూడాలి. మిథాలీ లేని మూడు మ్యాచుల్లో ఓడిన భారత్, ఇక్కడ ఆమెను తుది జట్టులోకి తీసుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జోరుమీదున్న న్యూజిలాండ్ జట్టు 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని చూస్తోంది.