Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్ : భారత చైనామన్ స్పిన్నర్, మణికట్టు మాయగాడు కుల్దీప్ యాదవ్ కెరీర్ అత్యుతమ ర్యాంక్ సాధించాడు. న్యూజిలాండ్తో చివరి టీ20లో రెండు వికెట్లు కూల్చిన కుల్దీప్ యాదవ్ బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. భారీ స్కోర్ల మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడినా, కుల్దీప్ బంతితో ఆకట్టుకున్నాడు. సిరీస్ ఆడిన ఏకైక మ్యాచ్లో ప్రమాదకర ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, కొలిన్ మన్రోలను కుల్దీప్ అవుట్ చేశాడు. అఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా, కుల్దీప్ నం.2గా నిలిచాడు. టాప్-10లో మరో భారత బౌలర్కు చోటు దక్కలేదు. మరో మణికట్టు స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ ఆరు స్థానాలు దిగజారి, 17వ స్థానంలో నిలువగా.. భువనేశ్వర్ కుమార్ 18వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాట్స్మెన్ జాబితాలో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగై ఏడో స్థానంలో నిలువగా, కెఎల్ రాహుల్ మూడు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి చేరాడు. టీ20 సిరీస్కు దూరమైన విరాట్ కోహ్లి నాలుగు స్థానాలు కోల్పోయి, 19వ స్థానంలో నిలిచాడు. జట్టు ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. న్యూజిలాండ్కు 1-2తో టీ20 కోల్పోయి రెండు రేటింగ్ పాయింట్లు కోల్పోయిన టీమ్ ఇండియా రెండో స్థానాన్ని నిలుపుకున్నది.