Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఇరానీ కప్నాగ్పూర్ : ప్రపంచకప్ జట్టు జాబితా ఇప్పటికే పూర్తి కావొస్తుంది. మూడో ఓపెనర్ స్థానం కోసం పోటీపడుతున్న అజింక్య రహానె సెలక్టర్లను మెప్పించే ఇన్నింగ్స్ ఇప్పటివరకూ ఆడలేదు. దీంతో ఇరానీ కప్లో రాణించైనా, సెలక్టర్ల దృష్టిలో పడాలని అతడు తపన పడుతున్నాడు. రంజీ ట్రోఫీ చాంపియన్ విదర్భతో రెస్టాఫ్ ఇండియా ఇరానీ కప్ కోసం పోటీపడనున్నది. భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రహానె సహా ఓపెనర్ మయాంక్ అగర్వాల్, హమను విహారి శ్రేయాష్ అయ్యర్లు రెస్టాఫ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విదర్భ స్టార్ సీమర్ ఉమేశ్ యాదవ్ విశ్రాంతి తీసుకున్నాడు. అతడు మినహా విదర్భ పూర్తి స్థాయి జట్టు ఇరానీ కప్లో బరిలోకి దిగుతోంది. 41 ఏండ్ల వసీం జాఫర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య సార్వాటె, వికెట్ కీపర్ అక్షరు వాడ్కర్, సీమర్ రజ్నీస్ గుర్బానీలు రెస్టాఫ్ ఇండియాపై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. వ్యక్తిగత ప్రదర్శనలపై ఆధారపడ కుండా, జట్టుగా సమష్టి ప్రదర్శనతో రంజీ విజేతగా నిలిచిన విదర్భ.. ఇరానీ కప్లో అదే వ్యూహంతో విజయం సాధించగలదని ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిత్ విశ్వాసం వెలిబుచ్చాడు. ఇరానీ కప్ పోరు విదర్భ సొంతగడ్డ నాగ్పూర్లో జరుగనున్నది.