Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్తో సిరీస్కు జట్టు ఎంపిక 15న
- వరల్డ్కప్ జట్టుకు ఇదే బ్లూ ప్రింట్
ముంబయి : ప్రతిష్టాత్మక ప్రపంచకప్కు ముందు టీమ్ ఇండియా ఆడబోయే ఆఖరి సిరీస్. వరల్డ్ కప్ సైన్యాన్ని పరీక్షించేందుకు సెలక్టర్లకు తుది అవకాశం. ఏ స్థానంలో ఎవరినీ పరీక్షించాలి, ఏ స్థానంలో ఎవరికి మరో అవకాశం ఇవ్వాలి, అసలు రేసులో ఉన్నదెవరు, పూర్తిగా పక్కనపడేసిన వారెందరు? వంటి ప్రశ్నలకు ఈ శుక్రవారం జవాబు దొరకనున్నది. స్వదేశంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ మార్చి 2 నుంచి ఆరంభం కానున్నది. తొలి వన్డే హైదరాబాద్లో జరుగనున్న సంగతి తెలిసిందే. అంతకుముందే, ఫిబ్రవరి 24న విశాఖలో టీ20 సిరీస్ మొదలవ్వనున్నది. మూడో ఓపెనర్, ఆల్రౌండర్ కోటాలో ఎంపికయ్యేదెవరు? సహా బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజా? ఖలీల్ అహ్మద్కే ఓటేస్తారా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీసే భారత్ ఆఖరు. ఈ సిరీస్లో ప్రపంచకప్ ప్రణాళికల్లో లేని ఆటగాళ్లను ప్రయోగించేందుకు జట్టు మేనేజ్మెంట్, సీనియర్ సెలక్షన్ కమిటీ ఏమాత్రం సిద్ధంగా లేదు. దీంతో ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపిక చేసే జట్టుపై ఇప్పుడు ఆసక్తి నెలకొన్నది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రపంచకప్కు వెళ్లేదీ, లేనిదీ శుక్రవారంతోనే తేలిపోనున్నది. మిడిల్ ఆర్డర్లో స్థానం కోసం ఎదురుచూస్తోన్న అజింక్య రహానె, మనీశ్ పాండే సహా మూడో ఓపెనర్పై కన్నేసిన కెఎల్ రాహుల్ల భవితవ్యం సైతం ఎటో తేలిసిపోయే అవకాశం ఉన్నది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి నిచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అది కేవలం టీ20 సిరీస్కు మాత్రమే పరిమితం కావచ్చు. రోహిత్ శర్మకు కొన్ని మ్యాచులకు విశ్రాంతి లభించే వీలున్నది. ఫిబ్రవరి 15న ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్న ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ఆస్ట్రేలియాతో టీ20, వన్డే సిరీస్లకు భారత జట్లను ఎంపిక చేయనున్నది.