Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
దుబాయ్ : న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో టీమ్ ఇండియా 0-3తో వైట్వాష్ ఓటమికి గురైనా, వ్యక్తిగత ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా క్రికెటర్లు గణనీయంగా మెరుగయ్యారు. పొట్టి సిరీస్లో 132 పరుగులు చేసిన ముంబైకర్ జెమీమా రొడ్రిగస్ టీ20 బ్యాట్స్మన్ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఆకట్టుకునే ప్రదర్శనతో నాలుగు స్థానాలు ఎగబాకిన జెమీమా వరల్డ్ నం.2 బ్యాటర్గా నిలిచింది. పొట్టి సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన స్మృతీ మంధాన సైతం నాలుగు స్థానాలు ఎగబాకింది. రెండు అర్ధ సెంచరీలు సహా 180 పరుగులు చేసిన మంధాన ఆరో స్థానంలో నిలిచింది. గత వారం వన్డే బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన మంధాన, తాజాగా టీ20ల్లో టాప్-10లోకి అడుగుపెట్టింది. బౌలర్ల జాబితాలో నాలుగు వికెట్లు కూల్చిన రాధ యాదవ్ 18 స్థానాలు మెరుగైంది. టాప్-10లోకి ప్రవేశించింది. ఐదు స్థానాలు మెరుగైన దీప్తి శర్మ 14వ స్థానంలో నిలిచింది. జట్టు ర్యాంకింగ్స్లో 3-0 విజయం సాధించిన న్యూజిలాండ్ రెండో స్థానానికి చేరుకోగా.. భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. టీ20 వరల్డ్ చాంపియన్ ఆస్ట్రేలియా అగ్రస్థానం నిలుపుకున్నది.