Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహాయక సిబ్బంది నియామకం
- విరుద్ధ ప్రయోజనాల వివాదం
ముంబయి : చాలా కాలం తర్వాత భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)లో మరోసారి విరుద్ధ ప్రయోజనాల అంశం చర్చకొచ్చింది. భారత్-ఏ, అండర్-19 జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ రానున్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా సహాయక కోచ్లను నియమించాలని బోర్డును కోరాడు. భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్, మాజీ వికెట్ కీపర్ విజరు యాదవ్లను సహాయక కోచ్లుగా తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ సబా కరీం, సీఈవో రాహుల్ జోహ్రీలకు కోరాడు. ఈ మేరకు వారిద్దరికి రాహుల్ ఈమెయిల్ పంపించారు. మార్చిలో నాలుగు దేశాల సిరీస్, భారత్-ఎ అనధికారిక టెస్టులకు తోడు వచ్చే ఏడాది అండర్-19 ప్రపంచకప్కు సన్నద్ధం అయ్యేందుకు రాహుల్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో పని భారం పంచుకోవటం సహా, భవిష్యత్ అవసరాల రీత్యా కోచ్లను సిద్ధం చేయటానికీ ఉపయుక్తంగా ఉంటుందని ద్రవిడ్ సూచించాడు. ఈ మేరకు జనరల్ మేనేజర్, సీఈవోలు అంగీకరించారు. కానీ విక్రమ్ రాథోర్ విషయంలో విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వస్తోంది. జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆశీష్ కపూర్కు విక్రమ్ వరుసకు బావ అవుతాడు. దీందో విరుద్ధ ప్రయోజనాల రీత్యా విక్రమ్ను నియమించడానికి వీల్లేదని బోర్డు ఆఫీస్ బేరర్లు అంటున్నారు. మీడియాలోనూ దీనిపై కథనాలొచ్చాయి. సిఫారసు పూర్తిగా రాహుల్ ద్రవిడే అయినా, సహచర సీవోఏ సభ్యురాలు డయాన ఎదుల్జీతో సంప్రదించిన తర్వాతే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ వినోద్ రారు తెలిపారు. బ్యాటింగ్ కోచ్గా విక్రమ్, ఫీల్డింగ్ కోచ్గా విజరు యాదవ్లు ప్రమాణిక కోచ్లుగా ద్రవిడ్ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నాడు.