Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పిన్నర్ల మాయాజాలం
- ఇరానీ కప్ పోరు
నాగ్పూర్ : రంజీ చాంపియన్ విదర్భ ఇరానీ కప్లో ఎదురీదుతోంది. రెస్టాఫ్ ఇండియా స్పిన్నర్లు కృష్ణప్ప గౌతమ్ (2/33), ధర్మేంద్రసిన్హ జడేజా (2/66) రాణించటంతో తొలి ఇన్నింగ్స్లో విదర్భ 245/6తో కొనసాగుతోంది. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్కు విదర్భ మరో 85 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. ఓపెనర్లు ఫజల్ (27), సంజరు రామస్వామి (65, 166 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. మిడిల్ ఆర్డర్లో గణేశ్ సతీష్ (48) సైతం రాణించాడు. కానీ స్పిన్ ఉచ్చులో పడిన విదర్భ 168/5తో కష్టాల్లో పడింది. అక్షరు వాడ్కర్ (50 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో పోరాడుతున్నాడు. లోయర్ ఆర్డర్లో ఆదిత్య (18), అక్షరు కర్నెవర్ (18) సాయంతో విదర్భను గట్టెక్కించే పనిలో ఉన్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అక్షరు వాడ్కర్, అక్షరు కర్నెవర్లు అజేయంగా ఆడుతున్నారు.