Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదర్భ తొలి ఇన్నింగ్స్ 425/10
- రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్
నాగ్పూర్ : బ్యాటింగ్ లైనప్ పతనంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయే ప్రమాదంలో పడిన విదర్భను లోయర్ ఆర్డర్ ఆదుకున్నది. వికెట్ కీపర్ అక్షరు వాడ్కర్ (73) తోడుగా రెచ్చిపోయిన అక్షరు కర్నెవర్ (102, 133 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు) జామ్తాలో వీరవిహారం చేశాడు. మెరుపు సెంచరీతో రెస్టాఫ్ ఇండియా బౌలర్లపై దండెత్తాడు. అక్షరు అనూహ్య ఎదురుదాడితో రెస్టాఫ్ ఇండియా బిత్తరపోయింది. అక్షరు వాకారె (20), రజ్నీశ్ గుర్బాని (28), ఠాకూర్ (10)లు చివర్లో ఆకట్టుకున్నారు. దీంతో విదర్భ తొలి ఇన్నింగ్స్లో 425 పరుగుల భారీ స్కోరు సాధించింది. రెస్టాఫ్ ఇండియా (330)పై తొలి ఇన్నింగ్స్లో పైచేయి సాధించింది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రెస్టాఫ్ ఇండియా ఆట ముగిసే సమయానికి 102/2తో పోరాడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (27), అన్మోల్ ప్రీత్ సింగ్ (6) ఆరంభంలో వికెట్ పారేసుకున్నారు. తెలుగు కుర్రాడు హనుమ విహారి (40 నాటౌట్, 85 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అజింక్య రహానె (25 నాటౌట్, 65 బంతుల్లో 1 ఫోర్లు) అభేద్యమైన మూడో వికెట్కు అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో ఆడుతున్నారు. రెస్టాఫ్ ఇండియా ప్రస్తుతం ఏడు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. నేడు రెస్టాఫ్ ఇండియా బ్యాటింగ్ ప్రదర్శన ఇరానీ కప్ ఎవరిదో తేల్చనున్నది!.