Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన రహానె, అయ్యర్
- విదర్భ లక్ష్యం 280, ప్రస్తుతం 37/1
నాగ్పూర్ : తెలుగు కుర్రాడు హనుమ విహారి (180 నాటౌట్, 300 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్లు) వరుసగా రెండో సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 114 పరుగులతో రెస్టాఫ్ ఇండియాకు మెరుగైన స్కోరు అందించిన విహారి, రెండో ఇన్నింగ్స్లో అజింక్య రహానె (87, 232 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఇరానీ కప్ విజయం దిశగా అడుగులు వేశాడు!. కెప్టెన్ రహానెతో కలిసి ద్వి శతక భాగస్వామ్యం నమోదు చేసిన విహరి 19 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. స్పిన్పై కాస్త ఇబ్బంది పడినా, పేసర్లపై నిర్దయగా చెలరేగాడు. రహానె నిష్క్రమణతో విహారితో జట్టు కట్టిన శ్రేయాష్ అయ్యర్ (61 నాటౌట్, 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాదన్ ఆడేశాడు. వేగంగా పరుగులు సాధించిన అయ్యర్, స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ను 374/3 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. 280 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ ప్రస్తుతం 37/1తో ఆడుతోంది. కెప్టెన్ ఫజల్ (0) డకౌట్ అయ్యాడు. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి సంజరు రామస్వామి (17), అతర్వ (16)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. విదర్భకు మరో 243 పరుగులు అవసరం కాగా, రెస్టాఫ్ ఇండియా తొమ్మిది వికెట్ల వేటలో నేడు బరిలోకి దిగనున్నది.