Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ టైటిల్ కోసం ఢీ
- జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్
గువహటి : 2018 టైటిల్ పోరు పునరావృతం. మరోసారి స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పి.వి సింధులు జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ రేసులో నిలిచారు. వరుస విజయాలు సాధించిన సింధు, సైనాలు నేషనల్స్ ఫైనల్లోకి అలవోకగా చేరుకున్నారు. మెన్స్ సింగిల్స్లో యువ సంచలనం లక్ష్యసేన్తో సౌరవ్ వర్మ టైటిల్ కోసం పోటీపడనున్నాడు. సైనా నెహ్వాల్ తొలుత క్వార్టర్స్లో నేహా పండిట్పై 21-10, 21-10తో వరుస గేముల్లో గెలుపొందింది. సెమీఫైనల్లో 21-15, 21-14తో బి. వైష్టవిపై విజయం సాధించింది. మరో సెమీస్లో పి.వి సింధు 21-10, 22-20తో నాల్గో సీడ్ అస్మిత చాలిహపై గెలిచింది. తొలి గేమ్ అలవోకగా నెగ్గినా, రెండో గేమ్ను టైబ్రేకర్ వరకూ తీసుకెళ్లింది అస్మిత. సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్పై యంగ్స్టర్ లక్ష్యసేన్ గెలుపొందాడు. 21-15, 21-16తో సెమీస్లో కశ్యప్ను ఓడించాడు. మరో సెమీస్లో క్వాలిఫయర్ సౌరవ్ వర్మ 21-14, 21-17తో మరో క్వాలిఫయర్ కౌశల్పై పైచేయి సాధించాడు.