Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్
ముంబయి : 2019 ప్రపంచ కప్కు 18 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. ' ప్రపంచ కప్ కోసం 18 మంది ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేశాం. తుది నిర్ణయం తీసుకునే ముందు అందరికీ రొటేషన్లో అవకాశం కల్పిస్తాం. పని భారం విషయానికొస్తే, చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచకప్ కుదించిన జాబితాలో ఉన్న 18 మంది ఆటగాళ్ల పని ఒత్తిడిని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఐపీఎల్ సందర్భంగా పరిశీలిస్తోంది. ఆయా ప్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపి, అవసరమైన ఆటగాళ్లను రొటేషన్ పద్దతిలో ఆడించాలనే ప్రతిపాదన బీసీసీఐ వద్ద ఉన్నది. ఐతే దీనిపై ప్రాంఛైజీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ' ప్రపంచకప్ జాబితాలోని ఆటగాళ్లను విశ్రాంతినివ్వాలనే విషయంలో ప్రాంఛైజీలకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ప్రపంచకప్ ఏడాది. అన్ని ప్రాంఛైజీలు భారత్కు చెందినవే. అంతర్జాతీయ వేదికపై భారత జట్టు ప్రదర్శన ముఖ్యమనే భావం అందరిలో ఉంటుంది. దీనిపై ప్రాంఛైజీలతో మాట్లాడి, ఆటగాళ్ల పని ఒత్తిడిని తగ్గించేలా నిర్ణయం ఉంటుంది' అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు.