Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : యువ సంచలనం పృథ్వీ షా తిరిగి బ్యాట్ పట్టనున్నాడు. వెస్టిండీస్పై అరంగేట్రంలోనే సంచలన శతకం బాదిన 19 ఏండ్ల షా, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టుకు ముందు వార్మప్ మ్యాచ్లో చీలమండ గాయానికి గురయ్యాడు. గాయంతో మూడు నెలలు ఆటకు దూరమైన షా, నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. యో యో పరీక్ష పాస్ కావటంతో ముంబయి సెలక్టర్లు అతడిని సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీకి ఎంపిక చేశారు. ఫిబ్రవరి 21న ఇండోర్లో జరిగే మ్యాచ్లో ముంబయి తరఫున పృథ్వీ బరిలోకి దిగనున్నాడు.