Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్తో బోర్డు ఎలెవన్ పోరు నేడే
ముంబయి : ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో సత్తా చాటిన స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన అదే జోరు ఇంగ్లాండ్పైనా కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ఇంగ్లాండ్తో టీమ్ ఇండియా మూడు వన్డేలు ఆడనున్నది. అంతకముందు నేడు బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్తో ఇంగ్లాండ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నది. బోర్డు ఎలెవన్ జట్టులో స్మృతీ మంధానతో పాటు వికెట్ కీపర్ ఆర్.కల్పన ఉన్నారు. న్యూజిలాండ్పై మూడు వన్డేల్లో ఓ 100, 90 సహా మంధాన 196 పరుగులు చేసింది. మంధాన మెరుపులతో తొలి రెండు మ్యాచుల్లోనే వన్డే సిరీస్ భారత్ సొంతమైంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో నిరాశపరిచిన ఓపెనర్ ప్రియ పూనియా బోర్డు ఎలెవన్ తరఫున మెరిసేందుకు ఎదురుచూస్తోంది. ప్రతిభావంతురాలైనా, ప్రియా తొలి రెండు టీ20ల్లో ఆకట్టుకోలేదు. సెలక్టర్ల మెప్పు పొందేందుకు ప్రియకు ఇది సదవకాశం. ఇటీవల ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భారత్ను ఓడించిన ఇంగ్లాండ్, వన్డేల్లోనూ ఆధిపత్యం చూపించాలని చూస్తోంది. టామీ బ్యూమోంట్, హీథర్ నైట్, డానీ వైట్లు ఇంగ్లాండ్ తరఫున ప్రభావం చూపగలరు. వన్డే మ్యాచులు ఫిబ్రవరి 22, 25, 28న ముంబయి వాంఖడేలో జరుగనున్నాయి. నేటి వార్మప్ మ్యాచ్లో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్కు స్మృతీ మంధాన సారథ్యం వహించనున్నది.