Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫారీ స్టార్ హర్షలె గిబ్స్
ముంబయి : 2019 ప్రపంచకప్ ఫేవరెట్స్ ఆతిథ్య ఇంగ్లాండ్, భారత్ అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షలె గిబ్స్ అభిప్రాయపడ్డాడు. ' ప్రపంచకప్ పోటీ ఎప్పుడైనా అందరికీ ఓపెన్. టైటిల్ రేసులో నిలిచిన రెండు బలమైన జట్లు మాత్రం భారత్, ఇంగ్లాండ్లు. మిగతా రెండు సెమీఫైనల్స్ బెర్త్లు ఎవరనే విషయం చెప్పటం కష్టం. ఇంగ్లాండ్ వాతావరణం ఎంతో ప్రభావం చూపుతుంది. మెరుగైన బౌలింగ్ దాడి చేయగల్గిన జట్టు మెరుగైన ఫలితాలు సాధించగలదు' అని గిబ్స్ అన్నాడు. విలక్షణ ఆటగాడు ఏబీ డివిలియర్స్ లేకపోయినా, దక్షిణాఫ్రికా అవకాశాలు బాగానే ఉన్నాయి. డుప్లెసిస్, డికాక్ మంచి ఫామ్లో ఉన్నారు. కానీ సఫారీలకు ఓ నాణ్యమైన ఆల్రౌండర్ కొరత కనిపిస్తోంది అని గిబ్స్ తెలిపాడు. టెస్టు క్రికెట్ భవిష్యత్పై ఇటీవల ఐసీసీ చైర్మెన్ శశాంక్ మనోహర్ ఆవేదన వ్యక్తం చేయగా, గిబ్స్ వాటిని కొట్టిపారేశాడు. ' టెస్టు క్రికెట్ ఇప్పటికీ బలంగా ఉన్నది. ఐదు రోజుల ఆటను పున సమీక్ష చేయాలని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. టెస్టు క్రికెట్కు నేను పెద్ద అభిమానిని. టెస్టులు నాలుగు రోజుల్లోనే ముగిస్తే మంచిదే కదా? ఐదు రోజుల వరకూ ఆడాల్సిన అవసరం లేదు' అని గిబ్స్ అన్నాడు.