Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్రసారాలు నిలిపివేస్తూ ఐఎంజీ రిలయన్స్ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ని కలవర పెడుతోంది. భద్రతా కారణాల రీత్యా పీఎస్ఎల్ యు.ఏ.ఈలో జరుగుతోంది. కానీ వచ్చే నెలలో తుది అంచె పోటీలు లాహోర్, కరాచీల్లో జరగాల్సి ఉన్నాయి. ఆ మ్యాచ్లకు సైతం ఐఎంజీ రిలయన్స్ ప్రసార భాగస్వామి. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. ఐఎంజీ రిలయన్స్ తప్పుకోవటం పీసీబీ కొత్త భాగస్వామి వేటలో పడింది. ' ఇటీవల జరిగిన పరిణామాలకు ఎంతగానో చింతిస్తున్నాం. ఇదే సమయంలో రాజకీయాలను, క్రీడలను ఒకే దృష్టితో చూడవద్దని చెబుతున్నాం. పీసీబీకి ఎప్పుడూ ప్రత్యామ్నాయ అవకాశాలు ఉంటాయి. త్వరలోనే పీఎస్ఎల్కు కొత్త భాగస్వామిని ప్రకటిస్తాం' అని పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ వెల్లడించారు.