Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్
న్యూఢిల్లీ : పుల్వామా దారుణ ఉగ్రదాడి నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా జరుగనున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో పాకిస్థాన్ షూటర్ల ప్రాతినిథ్యం సందిగ్థంలో పడింది. వీసాలు మంజూరు కాకపోతే, న్యూఢిల్లీ వరల్డ్కప్లో పాల్గొనబోమని పాక్ షూటింగ్ సమాఖ్య ప్రకటించింది. కానీ భారత హోం మంత్రిత్వ శాఖ అనుమతితో పాకిస్థాన్ షూటర్లకు వీసాలు మంజూరు చేశారు. దీంతో ఫిబ్రవరి 20 నుంచి జరుగనున్న ప్రపంచకప్లో పాల్గొనేందుకు పాక్ నుంచి ఇద్దరు షూటర్లు జిఎం బషీర్, ఖలీల్ అహ్మద్లతో పాటు మేనేజర్ భారత్కు రానున్నారు. ' పాక్ షూటింగ్ బృందానికి వీసాలు మంజూరు చేశారు. పాకిస్థాన్ షూటింగ్ ఫెడరేషన్ ఇద్దరు షూటర్లుకు, ఓ మేనేజర్కు టికెట్లు సైతం బుక్ చేసింది' అని నేషనల్ రైఫిల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) కార్యదర్శి రాజీవ్ భాటియా వెల్లడించారు.